Breaking News

06/08/2019

సకాలంలో పెన్షన్లు అందజేయాలి

రాజమహేంద్రవరం ఆగష్టు 6 (way2newstv.in - Swamy Naidu)
పెన్షన్దారులకు పెన్షన్లను సకాలంలో అందజేస్తే సమయానికి వారి అవసరాలు తీరతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ అన్నారు. స్థానిక 43 వ డివిజన్ వీవర్స్ కాలనీ పార్కులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి నెల మొదటి తారీకుల్లోనే పెన్షన్లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్ల కోసం ముందుగానే నిధులు కేటాయించాలని సూచించారు.
సకాలంలో పెన్షన్లు అందజేయాలి
గత ఐదేళ్లలో ఏ విధంగా అయితే ఇబ్బందులు లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగిందో అదే రీతిలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోరుమిల్లి విజయశేఖర్, మర్రి దుర్గ శ్రీనివాస్, సింహ నాగమణి, నాయకులు రెడ్డి రాజు,  ఉప్పులూరు జానకిరామయ్య, కంటిపూడి శ్రీనివాస్, బుడ్డిగ రవి, మళ్ళా వెంటరాజు, బిక్కిన రవి, మొల్లి చిన్ని యాదవ్, నిమ్మలపూడి గోవింద్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment