Breaking News

28/11/2019

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ  నవంబర్ 28  (way2newstv.in):
దేశరాజధానిలో గ్రీన్ సవాల్ కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కె.కేశవ రావు, బండ ప్రకాష్ పాల్గొన్నారు. 
గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరిత తెలంగాణ చేసారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కితాబిచ్చారు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 4.8 కోట్ల మొక్కలు నాటడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రకాష్ జవదేకర్ అభినందించారు.

No comments:

Post a Comment