Breaking News

20/07/2019

నటుడు నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్ధులున

హైదరాబాద్, జూలై 20 (way2newstv.in)
బిగ్ బాస్ షో ను నిలిపివేయాలంటూ  ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించారు. బిగ్ బాస్ 3 వివాదం పై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదు. మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా హోస్ట్ గా ఉంటారని వారు ప్రశ్నించారు. 
నటుడు నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్ధులున

పోరాడి సాధించుకున్న తెలంగాణ లో మహిళలను కించపరిచే , వేధించే బిగ్ బాస్ లాంటి షో లను విద్యార్థులం వ్యతిరేకిస్తున్నామని అన్నారు.  వెంటనే బిగ్ బాస్ ను ఆపివేయాలంటూ నినాదాలు చేసారు. అందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. 

No comments:

Post a Comment