Breaking News

30/03/2019

కోమటిరెడ్డికి టీజేయస్ మద్దతు

యాదగిరిగుట్ట మార్చ్ 30  (way2newstv.in)
యాదగిరిగుట్ట లో తెలంగాణ జన సమితి జిల్లా కార్యాలయాన్ని  టీజేయస్ అధ్యక్షుడు ప్రో.కోదండరాం శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం, రియు మహబూబాబాద్ లో మా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మేము ప్రచారం చేసి గెలిపించుకుంటామని అన్నారు. జాతీయస్థాయిలో వ్యవసాయం సంక్షోభ నివారానికి తీవ్రమైన ప్రయత్నం జరగాలని,  విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందాలని అయన అన్నారు.  నిరుద్యోగ పరిష్కారానికి ఏకాభిప్రాయానికి వచ్చి ప్రతి పేద కుటుంబానికి విధిగా నెలకు 6000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. 


కోమటిరెడ్డికి టీజేయస్ మద్దతు

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మద్దతు తెలుపుతున్నాం.  టీజేయస్ కార్యకర్తలు అందరూ కోమటిరెడ్డి కి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇవాళ పనిచేసే వారికి పట్టణాలు పల్లెల్లో గాని యువతీ యువకులకు ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నదే మా సంకల్పం అన్నారు.  ఇది అమలు కావడానికి మేము ఖచ్చితంగా కష్టపడి పని చేస్తాం.  మేము గెలిచిన చోట మా ప్రయత్నం ఉంటుందన్నారు.  ఇప్పుడు చేసిన పనులు అమలు కావాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని 21 పార్టీలతో కలిసి  మేనిఫెస్టోలోని రుణమాఫీ జాతీయ స్థాయిలో అమలు కావడానికి మా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు  జరిగే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాల  కొరకు జరిగే ఎన్నికలు కావు.  ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం డబ్బులను ఆశ జూపి ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తున్నరాని ఆరోపించారు.

No comments:

Post a Comment