Breaking News

07/07/2018

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్ జూలై 7    (way2newstv.in)   
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టితిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాధాకృష్ణన్ చేత ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు ప్రముఖులు, హైకోర్టు న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.1959 ఏప్రిల్ 29న కేరళలోని కొల్లాంలో రాధాకృష్ణన్ జన్మించారు. కర్ణాటకలో న్యాయవిద్య పూర్తి చేసిన జస్టిస్ రాధాకృష్ణన్.. 1983లో తిరువనంతపురం బార్ కౌన్సిల్ మెంబర్‌గా సభ్యత్వం పొందారు. ఎర్నాకుళంలో ప్రముఖ న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2017లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 15నెలల పాటు ఛత్తీస్‌గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగారు.మూడేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి సీజే నియామకం ఇదే.



హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

No comments:

Post a Comment