Breaking News

30/03/2019

జగన్ వస్తే..ఇడుపులపాయే రాజధాని

గుంటూరు, మార్చి 30 (way2newstv.in)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి ఇడుపులపాయకు మార్చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తారని విమర్శించారు. 


జగన్ వస్తే..ఇడుపులపాయే రాజధాని

జనసేన, సీపీఎం, బీఎస్పీ మద్దతుగా అసెంబ్లీ పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తరపున రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జనసేన కూటమిదే విజయమని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు దొందూదొందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కావాలంటే జనసేన, వామపక్షాల కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. 

No comments:

Post a Comment