Breaking News

30/03/2019

నేను 600 కోట్లే ఎగ్గోట్టాను...

ఏలూరు, మార్చి 30 (way2newstv.in)
డిఫాల్టర్ అంటే ఒళ్లు మండుతుందని నరసాపురం నుంచి వైఎస్ఆర్సీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. తాను బ్యాంకులకు చెల్లించాల్సింది రూ.3 వేల కోట్లు అని ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. తన కంపెనీ చెల్లించాల్సింది రూ.600-700 కోట్ల మేర మాత్రమే బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని తీర్చేస్తానని ఆయన చెప్పారు. 


నేను 600 కోట్లే ఎగ్గోట్టాను... 

వ్యాపారంలో ఇలాంటివి సహజమేనన్న ఆయన.. డిఫాల్ట్ ఉంది కట్టే ఉద్దేశం ఉందా అని ప్రశ్నిస్తారేంటని ఘాటుగా బదులిచ్చారు. ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టే తాను ఒళ్లు మండినా బదులిస్తున్నానని ఆయన తెలిపారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ కృష్ణ రాజు ఈ వ్యాఖ్యలు చేయగా.. దాన్ని జనసేన ట్వీట్ చేసింది. రూ.3000 కోట్లు కాదు కేవలం 600-800 కోట్లు ఎగ్గొట్టానని నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారని ట్వీట్ చేసింది. నరసాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికల ముందే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. 

No comments:

Post a Comment