Breaking News

14/02/2019

ఎవ్వరికి పట్టని దవాఖానాలు

నిజామాబాద్, ఫిబ్రవరి 14, (way2newstv.in)
జక్కల్ మండల కేంద్రంలోని సర్కార్ దవాఖానాలో సమయపాలన పట్టు తప్పుతోంది. సమయానికి రావల్సిన సిబ్బంది వేళపాళ లేకుండా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి హజరు పట్టికలో సంతకాలు చేసుకుని వెళుతున్నారు. కొందరు సిబ్బంది వచ్చి పనులు చేయకుండానే గంట పాటు టైంపాస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంత జరుగుతున్న వారిని అడిగేవారే కరువయ్యరు. మండల కేంద్రంలో ఒక్కరు కూడ ఉండి విధులు నిర్వహించరు. బోధన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహించారా అంటే గంగిరెద్దులా తలూపడానికేనన్నట్లు విధులు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్నారు. 


ఎవ్వరికి పట్టని దవాఖానాలు

ఎల్‌డిసి ఒక రోజు కూడ కనిపించరు. ఎఎన్‌ఎంలు ఇతర సిబ్బంది గ్రామాల్లో ఉంటున్నారా లేక మండల కేంద్రంలోని ఆసుపత్రికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారో ఎవరికి కూడ తెలియని పరిస్థితి నెలకొంది. ఏ గ్రామానికి వెళ్ళిన ఎఎన్‌ఎంలు స్థానికంగా ఉండరు. మీటింగ్‌లకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక గ్రామంలో ఉంటే మరొక గ్రామం పేరు చెప్పి తప్పించుకుంటున్నారు.సబ్‌సెంటర్‌లల్లో కూడ సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామాల్లో అయితే ఒక్క ఎఎన్‌ఎం కూడ ఉండరు. వారి సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తూ, వీరి విధుల నిర్వాహణ ఎలాంటిదో ఎవరికి కూడ అర్థమవ్వదు. వెనకబడిన మండలంగా పేరున్న జుక్కల్ మండలంలో ఎఎన్‌ఎంల నిర్వాహణ పట్ల ఒక్క అధికారి వచ్చి తనిఖీలు చేసిన దాఖాలాలు లేవు. కంటి వెలుగు పథకంలో భాగంగా సిబ్బందిని గ్రామాల్లోకి పంపుతున్నామంటు ఆరోగ్యశాఖ అధికారులు చేతులు లేపేయ్యడం తప్పించి చేసేదేమీ కనిపించడం లేదని తెలుస్తోంది. కంటి వెలుగుకు వచ్చే నిధుల్లో ఇద్దరు అధికారులు కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సిబ్బందిలోని కొందరు పేర్కొంటున్నారు.సిబ్బందికి ఆయ గ్రామాల్లోని అంగన్‌వాడి కార్యకర్తలే భోజన వసతి ఏర్పాటు చేస్తున్నప్పటికి వచ్చిన డబ్బులను కొందరు స్వాహ చేసి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా యేడాది కాలానికి ఆసుపత్రికి మంజూరయ్యే నిధుల విషయంలో కూడ ఆసుపత్రి మానిటరింగ్ కమిటి సభ్యులతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చిన రోగులకు తాగే నీటి వసతి కూడ కరువవుతుందని దీంతో వారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఇట్టే అర్థమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు జుక్కల్ ఆసుపత్రిలోని సిబ్బందిపై విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇ్పటికైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment