Breaking News

12/07/2018

క్లాసీ విజయాన్ని అందుకున్న సుధీర్

హైద్రాబాద్, జూన్ 12 (way2newstv.in)
సమ్మోహనం సినిమాతో మంచి క్లాసీ విజయాన్ని అందుకున్నాడు సుధీర్ బాబు. ఆ సినిమాకి మంచి అప్లాజ్ రావడంతో అదే జోష్ నన్ను దోచుకుందువటే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆర్‌.ఎస్‌ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది ఆ  విశేషాలు మీ కోసం.సుధీర్ బాబు హీరోగా ప్రస్ధుతం  తెరకెక్కుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. పాత సినిమా గులేభకావళి కథ సినిమాలోని సూపర్‌ హిట్ సాంగ్ పల్లవినే ఈ చిత్రానికి టైటిల్‌ గా పెట్టారు. కాగా ఈ చిత్రానికి సుధీర్‌ బాబే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్‌ సుధీర్‌ బాబుకు జోడిగా నటిస్తుండగా.. అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.కాగా ఇప్పటికే విడుదలైన నన్ను దోచుకుందువటే ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఈ సినిమాతో ప్రేక్షకులను మళ్ళీ సమ్మోహన పరచడానికి సుదీర్ బాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడుట. ఐతే తాజాగా ఈ చిత్ర టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ముహూర్తాన్ని నిర్ణయించారు. జూలై 14 తేదీన ఉదయం పది గంటల రెండు నిమిషాలకు నన్ను దోచుకుందువటే టీజర్‌ ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సమ్మోహనం చిత్రంతో సమ్మోహనపరిచిన ఈ యంగ్ హీరో నన్ను దోచుకుందువటే తో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి



క్లాసీ విజయాన్ని అందుకున్న సుధీర్

No comments:

Post a Comment