Breaking News

12/07/2018

వీసీలతో సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ జూలై 12, (way2newstv.in)
ఏపీని వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు అమరావతిలో వీసీలతో సమావేశమైన చంద్రబాబు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రగతి సాధిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 1500 రోజులైందని, అనేక రంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యారంగంలో సాధించే ప్రగతే ఆధారమన్నారు. ఒకప్పుడు ఐటీని అభివృద్ధి చేశామని, 20 ఏళ్లలో తెలుగువాళ్లు ప్రపంచంలోని అన్న మూలలకు చొచ్చుకెళ్లారన్నారు. సిలికాన్ వ్యాలీలో మనవాళ్లదే పైచేయి అన్నారు.



వీసీలతో సీఎం చంద్రబాబు భేటీ

No comments:

Post a Comment