Breaking News

13/01/2020

శబరిమలైలో జగిత్యాల అయ్యప్ప దీక్షపరుడు ఆకస్మికంగా మృతి

జగిత్యాల జనవరి 13 (way2newstv.in)
జగిత్యాల పట్టణానికి చెందిన అయ్యప్ప దీక్షపరుడు కేరళలోని శబరిమలైలో ఆకస్మికంగా మృతి చెందాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 9న అయ్యప్ప దర్శనానికి బయలుదేరి వెళ్లిన శ్రీగంధం రమేష్ శబరమలైలో పంబా నది వద్ద స్నానం చేస్తుండగా బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడు. రమేష్ మృతి వార్త తెలిసిన కుటుంబసభ్యులు మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేష్ మృతదేహం పట్టణానికి తీసుకు వచ్చెనందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వారు తెలిపారు.
శబరిమలైలో జగిత్యాల అయ్యప్ప దీక్షపరుడు ఆకస్మికంగా మృతి

No comments:

Post a Comment