Breaking News

13/01/2020

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ని ఇరికించారా..?

హైదరాబాద్ జనవరి 13 (way2newstv.in)
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఓ మహిళతో సరస సంభాషణలు జరిపినట్లుగా ఆడియో సంభాషణలు లీకవడం.. ఆయన తాజాగా రాజీనామా చేయడం తెలిసిందే. అయితే సొంత పార్టీకే చెందిన ఓ కీలక నేత వ్యూహాత్మకంగా ఆయన్ను పక్కకు తప్పించేందుకు ఇదంతా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళను ఆయనకు చేరువ చేసి ఇరికించారన్న ప్రచారం జరుగుతోంది. పృథ్వీరాజ్ ఆ స్థానంలో ఉండడాన్ని మొదటి నుంచి ఇష్టపడని కొందరు ఇదంతా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎస్వీబీసీ చైర్మన్ గా ఓ మహిళను నియమించాలన్న ఉద్దేశంతో పృధ్వీని పక్కకు తప్పించారన్న ప్రచారం జరుగుతోంది. 
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ని ఇరికించారా..?

దీనిపై పృధ్వీవైపు నుంచి ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ ఆయన అజాగ్రత్త వల్ల ఇందులో ఇరుక్కుపోయారన్న వాదన వినిపిస్తోంది. రాజకీయ ఎత్తులు ఇంకా అలవాటు కాకపోవడం... రాజకీయాల్లో అనుభవమున్న నేతలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఊహించకపోవడం వల్ల అడ్డంగా బుక్కయ్యారన్న వాదన వినిపిస్తోంది.మరోవైపు పృధ్వి తన తీరు కారణంగానూ చాలామందికి విరోధిగా మారారు. అటు సినీరంగానికి చెందినవారి నుంచి కానీ ఇటు వైసీపీ వర్గాల్లో కానీ ఆయనకు మద్దతు లేకుండా పోయింది. సొంత వర్గం లేకపోవడంతో పృధ్వి వైసీపీలో ఇప్పటికే ఏకాకిగా ఉన్నారని.. ఇప్పుడు పార్టీలో మళ్లీ ఆయన నిలదొక్కుకోవడం కానీ అటు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కానీ కష్టమన్న మాట వినిపిస్తోంది

No comments:

Post a Comment