Breaking News

21/01/2020

మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు

షాదనగర్ ఏసీపీ వి.సురేందర్
రంగారెడ్డి జనవరి 21, (way2newstv.in)
బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసిందని షాద్ నగర్ ఏసిపి వి. సురేందర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బుగ్గా రెడ్డి గార్డెన్ లో పోలీస్ శాఖ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బందికి ఎన్నికలపై ఏసిపి సురేందర్ సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ పోలింగ్ సందర్భంగా పటిష్ట భద్రతతో పాటు శాంతిభద్రతల నిర్వహణ, ప్రశాంతంగా ఓటు వేసేందుకు తగిన రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ మీడియాకు తెలిపారు. 
మున్సిపల్ ఎన్నికలకు భారీ బందోబస్తు

షాద్ నగర్ పట్టణంలో రేపు జరగబోయే పోలింగ్ కు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా శ్రీధర్ కుమార్ వెల్లడించారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ నేతృత్వంలో ఐదు మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐలు, 20 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 150 మంది కానిస్టేబుళ్ళు, ఆర్మీ బృందాలు 58, శిక్షణ ఎస్సైలు12 మంది మొత్తం హాజరవుతారని ఎన్నికల విధుల్లో హాజరు అవుతారని పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment