Breaking News

30/12/2019

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

హైద్రాబాద్, డిసెంబర్ 30, (way2newstv.in)
మద్యం ప్రియులకు హైదరాబాద్ మెట్రో డిసెంబర్ 31 ఆఫర్ ఇచ్చింది. మద్యం సేవించి మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చని తెలిపింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని అర్ధరాత్రి ఒంటి గంట వరకూ రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో సోమవారం (డిసెంబర్ 30) ప్రకటించింది. మందు బాబులకు ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించనుంది. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించి.. ఇంటి కెళ్లడానికి తిప్పలు పడకుండా ఊరటనిచ్చింది.ఏటా డిసెంబర్ 31 సందర్భంగా లెక్కకు మిక్కిలి మద్యంప్రియులు ఫూటుగా తాగి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు. వీరిలో మహిళలు, సెలబ్రిటీలు కూడా అధికంగా ఉంటున్నారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులతో వీరంగం చేస్తున్నారు. 
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. అయితే.. మద్యం తాగి మెట్రో రైళ్లలో వీరంగం చేస్తే ఎలా అనే సంశయం కూడా నెలకొంది. దీనికి మెట్రో అధికారులు స్పష్టత ఇచ్చారు.మద్యం తాగినవారినీ మెట్రో రైళ్లకు అనుమతిస్తామని.. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే ఈ అవకాశం కల్పిస్తామని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. మద్యం తాగి మెట్రో రైళ్లలో వీరంగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.మరోవైపు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అర్ధరాత్రి వరకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1.30 వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు ఉంటాయని తెలిపారు. అర్ధరాత్రి 1.30 గంటలకు లింగంపల్లి - ఫలక్‌నుమా, 1.15 గంటలకు లింగంపల్లి - హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.

No comments:

Post a Comment