Breaking News

10/12/2019

బుధవారం తిరుచానూరులో వన మహోత్సవం

తిరుపతి డిసెంబర్ 10  (way2newstv.in)
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 11వ తేదీ బుధవారం వన మహోత్సవం ఘనంగా జరుగనుంది. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 23 నుండి డిసెంబరు వ1వ తేదీ వరకు ఘనంగా జరిగాయి.  
బుధవారం  తిరుచానూరులో వన మహోత్సవం

ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతమైనందుకు గాను వన మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఆలయం వద్దగల శుక్రవారపుతోటలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీపద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తరువాత మహా నివేదన, వనమహోత్సవంలో భాగంగా ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించిన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

No comments:

Post a Comment