Breaking News

09/12/2019

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడి-వేడీగా చర్చ

విజయవాడ, డిసెంబర్ 9  (way2newstv.in)
తొలిరోజే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడి-వేడీగా చర్చ జరుగుతోంది. మహిళకు భద్రత అంశంపై సభలో చర్చకు సిద్ధంకాగా.. ఉల్లి ధరలపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళం ఏర్పడగా.. స్పీకర్ టీడీపీ తీరుపై మండిపడ్డారు. ఇలా ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే చర్చ కొనసాగించారు. చర్చలో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్ టార్గెట్‌గా రెచ్చిపోయారు.మహిళలంటే టీడీపీకి చులకన భావం అన్నారు రోజా. కాల్ మనీ రాకెట్‌లో టీడీపీ నేతల పేర్లు ఎక్కడ బయటపడతాయని భయం.. లోకేష్ ఫోటోలు, బాలయ్య మహిళలపై వ్యాఖ్యలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ఈ చర్చను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడి-వేడీగా చర్చ

ఈ చర్చను అడ్డుకున్నవారు అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పప్పులో ఉల్లిపాయ లేదని చంద్రబాబు బాధన్నారు.ఐదేళ్లలో టీడీపీ వాళ్లు చేసిన అరాచకాలు బయటపడతాయని గింజుకుంటున్నారని రోజా అన్నారు. గతంలో చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వోను అడ్డుకుంటే కేసు పెట్టలేదని.. నాగార్జున యూనివర్సిటీలో రితిషేశ్వరి అనే విద్యార్థిని వేధిస్తే.. ఆమె ఆత్మహత్య చేసుకుంటే చర్యలు లేవు అన్నారు. అప్పటి మంత్రి నారాయణ కాలేజీలో విద్యార్థుల మరణాలపై కేసులు లేవు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, కమిట్ అవ్వాలి అని ఓ ఎమ్మెల్యే అంటే చంద్రబాబు మాట్లాడలేదు అన్నారు.ఇటు పవన్ కళ్యాణ్‌ను రోజా టార్గెట్ చేశారు. రెండుచోట్ల ఓడిపోయిన ఓ నాయకుడు.. రేప్ చేసినవాళ్లను ఉరి తీయడం ఏంటి.. రెండు దెబ్బలు కొడితే చాలన్నారని.. గతంలో ఏం జరిగిందని రివాల్వర్‌తో రోడ్డుపైకి వచ్చారో చెప్పాలన్నారు. తన అక్కను అవమానిస్తే చంపాలని ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నామని.. మరి అలాంటప్పుడు అత్యాచారాలకు పాల్పడితే రెండు బెత్తం దెబ్బలా అంటూ ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లకు జరిగితే ఇలానే మాట్లాడతారా.. అసెంబ్లీలో ఉన్న వాళ్ల ఎమ్మెల్యే ద్వారా ఈ విషయాన్ని చెబుతున్నాను అన్నారు.

No comments:

Post a Comment