Breaking News

02/11/2019

పెరుగుతున్న పసిడి ధరలు

ముంబై, నవంబర్ 2 (way2newstv.in)
పసిడి ధర పెరుగుతూనే వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.40,070కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.10 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,740కు చేరింది. పసిడి ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. వెండి ధర రూ.450 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు తగ్గింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. 
 పెరుగుతున్న పసిడి ధరలు

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.38,710కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.37,510కు ఎగసింది.బంగారం ధర పెరిగితే సిల్వర్ మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.450 తగ్గింది. దీంతో ధర రూ.48,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,516.65 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 18.11 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

No comments:

Post a Comment