అమరావతి సెప్టెంబర్ 5 (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న దుష్ప్రచారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలనుట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ఖండించారు. టీడీపీతో గేమ్ ప్లాన్లో భాగంగానే.. పవన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై పవన్ఎప్పుడూ నోరు విప్పలేదని గుర్తుచేశారు.
పవన్ అందుకే వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు
టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పవన్ వ్యుహత్మకంగా మౌనం వహించారని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లుఒకటే అనేది అందరికి తెలిసిన విషయమేనని చెప్పారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారనివిజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన భవిష్యత్తు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం ఎప్పుడూ ఆర్టీసీ ఆస్తులను అమ్మడానికే చూశారనివిమర్శించారు.
No comments:
Post a Comment