Breaking News

10/09/2019

జగన్ పై లోకేష్ ట్వీట్ల దాడి

విజయవాడ సెప్టెంబర్ 10 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ట్వీట్ల దాడి కొనసాగిస్తున్నారు మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నిన్నటి వరకు జగన్ 100 రోజుల పాలనపై నిప్పులు చెరిగినలోకేష్.. తాజాగా యూనివర్శిటీల్లో ఉద్యోగుల తొలగింపుపై సీఎంను టార్గెట్ చేశారు. రోజులా కాకుండా కాస్త డోస్ పెంచి మామ నందమూరి బాలయ్య రేంజ్‌లో సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.
జగన్ పై లోకేష్ ట్వీట్ల దాడి

‘జగన్గారూ! పవిత్రమైన విద్యాలయాలను కూడా మీ కులరాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారెందుకు? ఎస్వీ యూనివర్సిటీలో అన్ని అర్హతలుండీ ఆరేళ్ళుగా విధులు నిర్వహిస్తున్న టీచింగ్ అసిస్టెంట్లనుఎందుకు తొలగించారు? మీకు కావాల్సిన ఒక సామాజికవర్గం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా?’అంటూ ప్రశ్నించారు‘మీ వైసీపీ కార్యకర్తలను అడ్డదారిలో యూనివర్సిటీలోకిపంపించి పునరావాసం కల్పించిన ఈ ఘటనపై విచారణ జరగాలి. ఏ కారణంతో ఉన్నవారిని తీసేసారు? ఏ ప్రాతిపదికన కొత్తవారిని తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. అధికారపక్షానికి వ్యతిరేకంగామాట్లాడితే అంతుచూస్తామంటూ విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తారా?’అంటూ మండిపడ్డారు.మీ వైసీపీ కార్యకర్తలను అడ్డదారిలో యూనివర్సిటీలోకి పంపించి పునరావాసం కల్పించిన ఈ ఘటనపైవిచారణ జరగాలి. ఏ కారణంతో ఉన్నవారిని తీసేసారు? ఏ ప్రాతిపదికన కొత్తవారిని తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతుచూస్తామంటూ విద్యార్థులనుపోలీసులతో బెదిరిస్తారా?ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టానుసారం అక్రమాలు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి ఉంది. ఆ హక్కును కాలరాసి, గొంతు నొక్కేస్తాం, అణగదొక్కేస్తాంలాంటి డైలాగులుప్రజాస్వామ్యంలో చెప్తే... తెలుగుదేశం చూస్తూ ఊరుకోదు ఖబడ్ధార్

No comments:

Post a Comment