Breaking News

26/08/2019

సిబిఐ కోర్టుకు హాజరయిన గాలి జనార్ధన్‌రెడ్డి

హైదరాబాద్ ఆగష్టు 26 (way2newstv.in - Swamy Naidu
బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి అవినీతి నిరోదక శాఖ కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతి శర్మ వచ్చారు. నాగమారుతి శర్మ సాక్ష్యం రికార్డు చేసుకున్న కోర్టు కేసు విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. 
సిబిఐ కోర్టుకు హాజరయిన గాలి జనార్ధన్‌రెడ్డి
ఓబులాపురం గనుల మైనింగ్ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డిని సీబీఐ కోర్టు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం అప్పటి సీబీఐ కోర్టు న్యాయమూర్తి పట్టాబికి లంచం ఇవ్వడానికి ముందు నాగమారుతీ శర్మకు కూడా లంచం ఇవ్వడానికి యత్నించాడని ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నాగమారుతీ శర్మ తనకు లంచం ఇవ్వజూపాడని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment