Breaking News

26/08/2019

మదర్ థెరిస్సా 109వ జయంతి వేడుకలు... q అనాధాలకు అన్నదానం చేసిన ప్రిన్స్ వహేబ్

ఎమ్మిగనూరుఆగస్టు 26 (way2newstv.in - Swamy Naidu
ప్రపంచ మానవతావాధి మదర్ థెరిస్సా 109వ జయంతి సందర్భంగా ప్రిన్స్ స్వచ్చంద సేవా సమితి అధ్యక్షుడు వహాబ్ శ్రీరాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ లో వుండే అనాధ పిల్లలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న.

 మదర్ థెరిస్సా 109వ జయంతి వేడుకలు...q అనాధాలకు అన్నదానం చేసిన ప్రిన్స్ వహేబ్
అని చాటి చెప్పిన గొప్ప మహిళ మదర్ థెరిస్సా అని అన్నారు.మాటలకు మాత్రమే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించిన ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ,భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలతో పాటు ఆమె ప్రేమకు,దయా హృదయానికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న గొప్ప మహిళ అని తెలిపారు.కార్యక్రమంలో శివశంకర్ రెడ్డి,పార్వతి, జయసింహరెడ్డి,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment