భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 7 (way2newstv.in)
కస్తూర్బా వసతి గృహంలో మంగళవారం రాత్రి పదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలోని కస్తూర్బాలోని తరగతి గది, వరండాలో విద్యార్థినులు గోడలపై చిత్రాలను వేసి రంగులు అద్దుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా రంగులు అద్దుతుండటంతో రంగుల వాసనకు విద్యార్థినులు కళ్లు తిరిగి స్పృహ కోల్పోయారు.
కస్తూరిబా విద్యార్థులకు అస్వస్థత
దీంతో వసతి గృహ నిర్వహకులు వెంటనే వారిని పాల్వంచ సీహెచ్సీకి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించారు. పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండటంతో... మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినుల అస్వస్థతకు రంగుల వాసన కారణమా? లేదా ఆహార పరమైన కారణాలు ఉన్నాయా? అన్న విషయంలో స్పష్టత లేదు.
No comments:
Post a Comment