పెరటికోళ్ల పెంపకం ఒక ఏడాదికే పరిమితమైంది. దీనిపై ఎంతో ఆశపెట్టుకున్న పేదలకు ఈ పథకం అందుబాటులో లేకుండా పోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం పెరటికోళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి తెల్లరేషన్ కార్డుగల నిరుపేదలందరూ అర్హులుగా నిర్ణయించింది.పేరటికోళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసే కోళ్లు మేలుజాతివి కావడంతో వీటికి రోగని రోధక శక్తి అధికంగా ఉంటుంది. వీటికి దాన కింద మక్కలతో పాటు, ప్రత్యేకంగా తయారు చేసిన దానను అధికారులు అప్పట్లో సబ్సిడీపై పంపిణీ చేశారు. కాగా పూర్తిగా నాటు(దేశీయవాలి)కోడితో సమానంగా పెరిగేవి. కొద్ది సమయంలోనే ఈ కోడి 6 కిలోల బరువు వరుకు పెరుగుతుందని అధి కారులు చెబుతున్నారుకానీ కోడిని అమ్మటం కన్నా మూడు మాసాలకోసారి 140 నుంచి 160 వరకు పెట్టే గుడ్లను విక్రయిస్తేనే లబ్ధిదారుడికి అధిక మొత్తంలో లాభం ఉంటోంది. ఈ గుడ్లను తిన్నప్రజలకు సైతం రోగనిరోదక శక్తి పుష్కలంగా లబిస్తోంది. ముఖ్యంగా ఈ పథకం గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ముందుకు సాగని పెరటికోళ్ల పెంపకం
అడవిబిడ్డలు అధిక శాతం ఊరికి దూరంగా అడవుల్లో ఉం టారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేషనల్ లైవ్స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. పథకం ప్రారంభంలో జిల్లాకు 380 యూనిట్లు మంజూరు చేశారు. దీంతో నిరుపేదలను గుర్తించిన వెటర్నరీ అధికారులు ముందుగా 300 యూనిట్లను పంపిణీ చేశారు. కారణాలతో 80 యూనిట్లు అప్పట్లో లబ్ధిదారులకు అందించలేక పోయారు.2017లోనూ పెరటికోళ్ల పథకానికి నిధులు మంజూరి అయితే వాటితో పాటు మిగిలిపోయిన 80 యూనిట్లను సైతం లబ్ధిదారులకు పంపిణీ చేయలనుకున్న అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఒక ఏడాదికే ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడటంతో మిగిలిపోయిన 80 యూనిట్లను ఎవరికి పంపిణీ చేసినా.. మిగతా లబ్ధిదారులతో ఇబ్బందులు వస్తాయని ఆ 80 యూనిట్లను ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు ఒక్కో యూనిట్లో 45 కోళ్లు ఉంటా యి. వీటి ఖరీదు రూ.3,750. లబ్ధిదారుడి వాటా గా కేవలం రూ. 810 మాత్రమే చెల్లించాలి. అంటే కేవలం 20 శాతం మాత్రమే. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద యూనిట్కు రూ. 2,940 చెల్లిస్తుంది. వెటర్నరీ అధికారులు మేలుజాతి కోళ్లను లబ్ధి దారుడికి అందజేస్తారు. 45 కోళ్లలో 5 పుంజులు ఉండగా 40 కోడిపెట్టలుంటాయిఅంతేకాకుండా వీటికి దానకోసం ఉపయోగించేందుకు మక్కల మిషన్ , నెట్(వల) తదితర వాటిని కోళ్లకు ఉపయోగించే పరికరాలను సైతం ప్రభుత్వం అప్పట్లో సరఫరా చేసింది. ఈ కోళ్లు కేవలం 2 నెలల్లోనే గుడ్లుపెట్టడం మొదలు పెడుతుంటాయి. ఒక్కో కోడిపెట్ట 140 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. ఒక్కో గుడ్డు 60 గ్రాముల తూకం ఉంటుందిపూర్తిగా దేశీయవాలి గుడ్లు కావడంతో వీటికి మంచి డిమాండ్ ఉండేది. వీటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని అధికారులు సైతం బావించారు. రెండు సంవత్సరాల క్రితం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఈ పథకం నిరుపేదలకు ఎంతో మేలుచేసేదిగా ఉందని పేర్కొంటున్నారు.దీంతో పెరటికోళ్ల పథకం ద్వారా కోళ్లను పొందిన లబ్ధిదారులు వారు ఉండే ప్రాంతాల్లో వదిలిపెడితే రోజంతా ఆరుబయటనే గింజలు, పురుగులను తిని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాయి.
No comments:
Post a Comment