Breaking News

05/07/2019

టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గోపాల్ పేట సర్పంచ్

వనపర్తి జూలై 5 (way2newstv.in)
మండల కేంద్రమైన గోపాల్ పేట సర్పంచ్ పి. శ్రీనివాసులు  వనపర్తి జిల్లా కేంద్రంలోని  మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం , మరియు టిఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. 
 టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గోపాల్ పేట  సర్పంచ్


ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన. శ్రీనివాసులు , వార్డ్ నెంబర్లు మరికొంత మంది సభ్యులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడమే కాకుండా మంత్రిచే పార్టీ కండవ కప్పుకొని టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అందరూ ఎమ్మెల్యేలు సభ్యత్వ నమోదు కార్యక్రమం లో నిమగ్నమై ఉన్నారని ఆయన అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా గోపాల్పేట సర్పంచ్ శ్రీనివాసులు తన అనుచరులతో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరడం ఎంతో గమనార్హమని మంత్రి అన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ద్యేయంగా టిఆర్ఎస్ పార్టీ పై నమ్మకంతో మంత్రి గారి సమక్షంలో పార్టీలో చేరానని ఆయన వ్యక్తపరిచారు. గ్రామాభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న తాను మంత్రి నిరంజన్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని సర్పంచ్ శ్రీనివాసులు అన్నారు. 

No comments:

Post a Comment