Breaking News

05/07/2019

బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షం: రేవంత్‌రెడ్డి


న్యూఢిల్లీ‌ జూలై 5 (way2newstv.in)
బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మే అని రేవంత్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. 

బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షం: రేవంత్‌రెడ్డి


లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో విద్య, ఉద్యోగాలకు ప్రోత్సాహం అందించే ఎలాంటి పథకాలూ లేవని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రూ.1 పన్ను చెల్లిస్తే తిరిగి రూ.2 చెల్లిస్తున్నారని.. బిహార్‌ రూ.1 పన్ను ఇస్తే తిరిగి రూ.1 ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను చెల్లిస్తే 65 పైసలే ఇస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆదాయపన్నులో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లేదని ఆయన విమర్శించారు. 

No comments:

Post a Comment