నంద్యాల మే 16 (way2newstv.in)
ఆళ్లగడ్డ మండలం లో నల్లగట్ల గ్రామంలో గురువారం నాడు దేవస్థానం అధికారులు దేవస్థానం పరిధిలో ఉన్న భూములను కౌలుకు వేలం వేయాలని నిర్ణయించారు. ఊరి ప్రజలు వేలాన్ని అడ్డుకోని అధికారులను వెనక్కి పంపించారు . ఆళ్లగడ్డ మండలం లో నల్లగట్ల గ్రామంలో సుమారు 90 ఎకరాల దేవస్థానం ఆధ్వర్యంలో భూమి వుంది. ప్రతి సంవత్సరం కౌలు కింద. 9 లక్ష ల రూపాయలు దేవస్థానం అధికారులకు కౌలు ద్వారా ఆదాయం వస్తుందని. ప్రజలు ఆరోపిస్తున్నారు.
దేవాదాయ భూముల కౌలు వేలాన్ని బహిష్కరణ
గ్రామంలో దేవాలయాలు అధ్వానంగా వున్నాయని. దేవాలయాల. బాగోగులు అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం . కౌలు కింద వచ్చిన డబ్బులకు అధికారులు లెక్కలు చెప్పడం లేదని గ్రామస్తులు ఆంటున్నారు. కనీసం మేము ఇస్తున్న కౌలు డబ్బులతో నైనా దేవాలయాలు బాగు చేయించాలని పలువురు భక్తులు ప్రజలు కోరుతున్నారు. ఈ సంవత్సరంలో దేవస్థానం భూములను ఎవ్వరు కూడా కౌలు వేలానికి పాడ కూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
No comments:
Post a Comment