Breaking News

20/05/2019

ఏపీలోటీడీపీకే పట్టం : ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా


హైద్రాబాద్, మే 20 (way2newstv.in)  
2014 ఎన్నికల్లో అన్ని నేషనల్ సర్వేలతో పాటు, టీవీ ఛానల్స్ అన్నీ వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారంటూ సర్వే ఫలితాలను వెల్లడించారు. అయితే లగడపాటితో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవానికే పెద్ద పీట వేయబోతున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జోస్యం చెప్పారు. అన్నట్టుగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే నిన్నటి రోజున లగడపాటి రాజగోపాల్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను వెల్లడిస్తూ.. చంద్రబాబుకే పట్టం కట్టారు. అయితే నేషనల్ మీడియా మొత్తం జగన్‌నే కాబోయే ముఖ్యమంత్రి అంటూ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ఫ్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే ఫలితాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఈ సర్వేలను వెలువడిస్తున్నది కేవలం జనరల్ ఒపీనియన్‌తో మాత్రమే. నాకు ఎలాంటి సర్వే సంస్థలు లేవు. ఎగ్జిట్ పోల్స్ చేయలేదు. ఒపీనియన్ పోల్ చేయలేదు. అయితే సైంటిఫిక్‌గా ఇస్తున్న ఫిగర్ కాదు. అందువల్ల నా సర్వే రైట్ అయినా రాంగ్ అయినా తిట్టకండి. 



ఏపీలోటీడీపీకే పట్టం : ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా

తెలంగాణ ఎన్నికల ఫలితాలప్పుడు లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా నేను చెప్పాను అదే నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా.. నా అంచనా ఏంటంటే ప్రభుత్వానికి అంత అనుకూలంగా లేదు. మొత్తం 175 సీట్లను చూస్తే.. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కూడా కంఫర్టబుల్‌గా ఈ సీట్లలో వైసీపీ గెలుస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇవే సీట్లు గెలుస్తుందని కాని.. నెంబర్ చెబుతున్నా. సిట్టింగ్ సీట్లు అన్నీ ఎప్పుడూ ఏ పార్టీ గెలవదు. ఓ పది సీట్లు అటూ ఇటూగా గెలవచ్చు.. ఓడొచ్చు. అయితే ఖచ్చితంగా వైసీపీకి 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు అయితే వచ్చాయో.. ఈసారి ఆ సంఖ్య ఖచ్చితంగా అలా ఉంటుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే.. 50-55 సీట్లు ఖచ్చితంగా గెలిచేవి ఉన్నాయి. అంటే వైసీపీ 60-65 సీట్లు, టీడీపీ 50-55 సీట్లు పక్కాగా గెలుచుకునే స్థానాలు ఉన్నాయి. 125 సీట్లలో (ప్లస్ ఆర్ మైనస్) 120-125 సీట్లు చాలా క్లియర్‌గా రిజల్ట్ ఉంది (రెండు పార్టీలకు కలిపి). చాలా ఎగ్జిట్స్ పోల్స్ టీడీపీ 50 సీట్లు కూడా రావని చెబుతున్నారు కాని.. నా అంచనా ప్రకారం ఖచ్చితంగా 50 సీట్లు పక్కాగా గెలుస్తుంది. ఇక మిగిలిన 50-60 సీట్లు (ప్లస్ ఆర్ మైనస్)లో చాలా గట్టిపోటీ ఉంది.వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే.. 2014 లో వచ్చిన సంఖ్యాబలం అలానే ఉంది. మిగతా 50-60 సీట్లలో వైసీపీ 20-25 గెలుచుకుంటే విన్ అవ్వొచ్చు. అదే టీడీపీ గెలవాలంటే 40-45 సీట్లను గెలవాలి. ఈ లెక్కల్లో వైసీపీ నష్టం కంటే లాభం ఎక్కువ. టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదు. అందువల్ల టీడీపీకి ఇది పెద్ద ఛాలెంజ్. లగడపాటి చెప్పినట్టుగా టీడీపీకి వంద సీట్లు రావాలంటే.. టఫ్ ఫైట్‌గా ఉన్న ఈ 50-60 సీట్లలో 50 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. ఇది చాలా డిఫికల్ టార్గెట్. అందువల్ల చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే అదొక అద్భుతమే. మిరాకిల్.. వండర్ ఏదైనా అనొచ్చు. రాదు అని నేను చెప్పడం లేదు. చంద్రబాబు పోల్ మేనేజ్‌మెంట్‌లో సిద్ధహస్తుడు అయినప్పటికీ జగన్ సైలెంట్‌గా ఉండే టైప్ కాదు.ఏ రకంగా చూసినా చంద్రబాబు మళ్లీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద సవాల్. ఖచ్చితంగా వైసీపీ ఎడ్జ్ ఉందని క్లియర్‌గా అర్ధం అవుతుంది. ఇక ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి అన్న విషయానికివస్తే.. వైసీపీకి 98 నుండి 102 సీట్లు రావడానికి 70 శాతం అవకాశం ఉంది. ఇవే సీట్లు టీడీపీకి రావాలంటే 30 శాతం మాత్రమే అవకాశం ఉంది. టోటల్‌గా టీడీపీకి రాదని నేను అనడం లేదు కాని.. వైసీపీకి విజయావకాశాలు ఎక్కువ. ఇక జనసేన ప్రభావం పెద్దగా ఉండదు. 3-5 సీట్లు జనసేనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే.. వైసీపీ 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కులాల వారీగా చూస్తే.. ఓటర్లు చీలిపోయారు. కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ వర్గాలు టీడీపీ వైపు ఉన్నారు. అలానే వైసీపీకి రెడ్డి, దళితులు, మైనారిటీ మద్దతు ఉంది. అయితే కాపు, బీసీ ఓటింగ్‌ చాలా కీలకంగా మారింది. కాపు ఓట్లలో సగం ఓట్లు జనసేనకు పడ్డాయి. మిగతా సగం టీడీపీ వైపు మొగ్గుచూపారు. ఇక కీలకమైన బీసీ ఓట్లు వైసీపీ వైపు ఉన్నారు. ఈ ఓట్లు వైసీపీ వైపు షిప్ట్ అయితేనే చంద్రబాబు ఓడిపోతారు. వైసీపీ గెలవడానికి కీలకమైన అంశం ఏంటంటే.. బీసీ ఓట్లు. ఉత్తరాంధ్రలో వెలమలు, ఆంధ్రలో శెట్టిబలిజలు వైసీపీకి అండగా నిలబడ్డారు. ఇదే కనుక నిజమైతే టీడీపీకి ఓటమి తప్పదు. అక్కడ జనసేన వల్ల కాపు ఓట్లు చీలాయి.. ముస్లిం ఓట్లు పక్కాగా తమకే పడ్డాయని టీడీపీ భావిస్తోంది కాని.. వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయి. మరోవైపు లబ్ధిదారులు, పసుపు కుంకుమ పథకాలే తమను గెలిపిస్తాయని టీడీపీ భావిస్తున్నా.. అది ఎంత మేరకు జరిగిందది అన్నది ప్రశ్నగానే ఉంది. నిజం చెప్పాలంటే.. చంద్రబాబుపైన ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్‌కి ఒక్క అవకాశం ఇవ్వాలని క్షేత్రస్థాయిలో ఉంది. దీనికి తోడు టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ ప్రభావంతోనే టీడీపీ ఓడిపోయే ప్రమాదం ఏర్పడింది’ అంటూ 2019 ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ అందించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మరి ఈయన చెప్పినట్టుగా జగన్ సీఎం అవుతారా? చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితం అవుతారా? అన్నది మే 23న తేలిపోనుంది.

No comments:

Post a Comment