Breaking News

14/05/2019

మైసంపల్లి గ్రామంలో మట్టి నమూనాలు సేకరణ

నంగునూరు, మే 14 (way2newstv.in):
నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయ ఆధికారి గీత ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించారు. మండలంలో  మైసంపల్లి గ్రామాన్ని ఎస్ హెచ్ సి కింద ఎంపిక చేశారు. 

మైసంపల్లి గ్రామంలో మట్టి నమూనాలు సేకరణ

ఇందులో భాగంగా నే గ్రామంలో ఉదయం నుండి రైతుల భూముల వద్దకు వెళ్లి నమూనాలు సేకరించారు. ఈ నమూనాల ద్వారా అనేక లాభాలున్నాయని‌ వ్యవసాయాధికారి‌ గీత తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులుమౌనిక, అశోక్, శిరీష, ప్రేమసాగర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment