Breaking News

25/04/2019

నిప్పుతో చెల‌గాటం ఆడుతున్నారు జాగ్రత్త: జ‌స్టిస్ మిశ్రా వార్నింగ్

న్యూ డిల్లీ  ఏప్రిల్ 25 (way2newstv.in)  
సంప‌న్నులు, శ‌క్తివంత‌మైన వాళ్లు కోర్టును బ్లాక్‌మెయిల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, కానీ వాళ్లు నిప్పుతో చెల‌గాటం ఆడుతున్నార‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించాల‌ని జ‌స్టిస్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌వారికి ఇవాళ జ‌స్టిస్ అరుణ్ మిశ్రా తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. ఉత్స‌వ్ సింగ్ బెయిన్స్ వేసిన కేసులో వాద‌న‌లు విన్న త‌ర్వాత జ‌స్టిస్ అరుణ్ మిశ్రా ఈ కామెంట్స్ చేశారు. ఎవ‌రైనా వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని భావిస్తే వారిని అంతం చేసేందుకో లేక నిర్వీర్య ప‌రిచేందుకు కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. 


నిప్పుతో చెల‌గాటం ఆడుతున్నారు జాగ్రత్త: జ‌స్టిస్ మిశ్రా వార్నింగ్

లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జ‌స్టిస్‌ను ఇరికించేంద‌కు ఓ శ‌క్తివంత‌మైన గ్యాంగ్ ప‌నిచేస్తున్న‌ట్లు ఉత్స‌వ్ కోర్టులో పిటిష‌న్ వేశారు. అజ‌య్ అనే వ్య‌క్తి సీజేఐపై కేసు వేయాలంటూ త‌న‌ను ఆశ్ర‌యించిన‌ట్లు న్యాయ‌వాది ఉత్స‌వ్ పేర్కొన్నాడు. త‌నను సీజేఐ లైంగికంగా వేధించార‌ని మాజీ ఉద్యోగి ఒక‌రు న్యాయ‌మూర్తుల‌కు లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే. ఆమెకు తెలిసిన వ్య‌క్తినంటూ అజ‌య్ అనే వ్య‌క్తి న్యాయ‌వాది ఉత్స‌వ్‌ను ఆశ్ర‌యించాడు. ఈ కేసు విచార‌ణ చేపట్టిన సుప్రీం బెంచ్ ఇవాళ వాద‌న‌లు విన్న‌ది. దేశ ప్ర‌జ‌లు వాస్త‌వం తెలుసుకోవాల‌ని డ‌బ్బు శ‌క్తితోనే లేక రాజ‌కీయ శ‌క్తితోనే సుప్రీంకోర్టు న‌డ‌వ‌ద‌ని తెలుసుకోవాల‌ని ఎవ‌రైనా వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని చూస్తే వారిని చంపేస్తున్నార‌ని, ఇక ఇలాంటి ఆట‌లు సాగ‌వ‌ని జ‌స్టిస్ మిశ్రా అన్నారు. ఉత్స‌వ్ బెయిన్స్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా అడ‌గ్గా.. దాన్ని సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.

No comments:

Post a Comment