Breaking News

02/04/2019

జనసేన కోసం హైపర్ ఆది

ఏలూరు, ఏప్రిల్ 2(way2newstv.in)
జనంతో మనం అంటున్నారు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది. ఏపీ ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ప్రారంభించారు. పనిలో పనిగా జబర్దస్త్ జడ్జ్, జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగబాబుకు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం భీమవరంలో ప్రచారం చేస్తున్నారు. మెగా అభిమానులు, జనసైనికులతో కలిసి ఇంటింటికి తిరిగి జనసేనను గెలిపించాలని కోరుతూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆదితో పాటూ నాగబాబు సతీమణి పద్మజ కూడా పాల్గొన్నారు. 


జనసేన కోసం హైపర్ ఆది

ఎంపీగా నాగబాబును, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలంటున్నారు ఆది. తన జబర్దస్త పంచ్‌లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నర్సాపురం లోక్‌సభ, భీమవరం నియోజకవర్గాలను అభివృద్ధి కావాలంటే వారిని గెలిపించాలని కోరుతున్నారు. పవన్‌ కళ్యా‌ణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో హైపర్ ఆదిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు.. సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు. జబర్దస్త్‌తో మంచిపేరు సంపాదించుకున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్‌కు అభిమాని. అందుకే పార్టీలో చేరకపోయినా.. జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. నర్సాపురం, భీమవరంతో పాటూ రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడుతున్నారు. 

No comments:

Post a Comment