Breaking News

23/03/2019

టీడీపీ అభ్యర్థుల్లో 100 మంది ఓడిపోతారు..

అన్ని కులాలు ఒకటేన్న భావనతో ముందుకు పోతున్నాం..
ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్..
గుడివాడ,   మార్చి 23,(way2newstv.in)
గుడివాడ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు తనను గెలిపించలేదని వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో చాలామందికి సీట్లు ఇచ్చారని అన్నారు. నేతలు ఎన్నికల్లో గెలుస్తుంటారు, ఓడిపోతుంటారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇటీవల ప్రకటించిన 126 మంది అభ్యర్థుల్లో 100 మంది ఓడిపోతారని జోస్యం చెప్పారు. తాను గుడివాడ ఎమ్మెల్యే అయ్యాక కుల, మతాల ఘర్షణలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలతో గుడివాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నాని మాట్లాడారు.


టీడీపీ అభ్యర్థుల్లో 100 మంది ఓడిపోతారు..

అన్ని కులాలు మానవకులం అనే భావనతో తాము ఉన్నామన్నారు. అన్న ఎన్టీఆర్, వైఎస్సార్, వంగవీటి మోహనరంగా, డా.బీఆర్ అంబేద్కర్ చూపిన దారిలో ముందుకు పోతున్నామని నాని తెలిపారు. 
ఈరోజు విజయవాడలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఓ మహానుభావుడిని పొట్టనపెట్టుకున్న కుటుంబం నుంచి ఓ వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారని దేవినేని అవినాశ్ ను పరోక్షంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం విజయవాడ నుంచి 200-300 అల్లరిమూకలు గుడివాడలో దిగారనీ, ఇళ్లు తీసుకుని ఉంటున్నారనిఆరోపించారు. గుడివాడలోని తమ మద్దతుదారులకు విజయవాడ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంతమంది వైసీపీ శ్రేణులను వ్యక్తిగతంగా కలిసి భయపెడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలని భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  

No comments:

Post a Comment