Breaking News

17/08/2018

అయోమయంలో జగన్ : డిప్యూటీ సీఎం కెఈ

కర్నూలు, ఆగస్టు 17, (way2newstv.in)
ప్రతిపక్ష నేత జగన్ అయోమయంలో వున్నారు .రోజుకో మాట మారుస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లకు మద్దతు అని, రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ వేర్వేరుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం నాడు అయన మీడియాతో మట్లాడారు. కాపులకు న్యాయం జరిగేది టీడీపీ హయాంలోనే.. రాజన్న రాజ్యం అంటే ఐఎఏస్ అధికారులను జైలుకు పంపడమా అని అయన ప్రశ్నించారు. జగన్ భార్య భారతిపై అవినీతి లేకుండా ఇడి కేసులు పెడుతుందా.. భూములు సేకరిస్తే తూటాలకు అడ్డువస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. అభివృద్ధికి కేంద్రం అనేక అడ్డంకులు కల్పిస్తున్నారు. బీజేపీ అంటే బ్రోకర్ల జగన్ పవన్ పార్టీగా మారిందని అన్నారు.



అయోమయంలో జగన్ : డిప్యూటీ సీఎం కెఈ 

No comments:

Post a Comment