Breaking News

26/06/2018

జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు:సీపీఐ రామకృష్ణ

విశాఖపట్నం జూన్ 26 (way2newstv.in):
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ధ్యాస మొత్తం ముఖ్యమంత్రి సీటు మీదే ఉందని ఆయన అన్నారు. అయితే, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని దోచేశారని విమర్శించారు. జగన్ ను అంత ఈజీగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. వైసీపీ, జనసేనలు కలుస్తాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రామకృష్ణ మాట్లాడుతూ, వైసీపీతో చేతులు కలిపితే జనసేన కథ ముగిసినట్టేనని చెప్పారు. 



జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు:సీపీఐ రామకృష్ణ

No comments:

Post a Comment