Breaking News

31/01/2020

సిటీలో డ్రైవర్లకు డిమాండ్

హైద్రాబాద్, జనవరి 31, (way2newstv.in)
హైద్రాబాద్ లో సిటీలో డ్రైవర్లు కొరత తీవ్రంగా ఉంది. కార్పొరేట్ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫోర్టు సంస్థలు ఓలా, ఊబర్‌లు రావడంతో చాలా మంది డ్రైవర్లు ఓనర్లుగా మారారు. దీంతో నగరంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా వైట్ ప్లేట్ వాహనాలు నడిపేందుకు అసలు దొరకడం లేదు. ఈ క్రమంలో టెంపరరీ డ్రైవర్లకు పుల్ డిమాండ్ పెరిగింది. సిటీలో 8 గంటలకు సుమారు రూ.600 నుంచి వెయ్యి, సిటీ నుంచి ఇతర జిల్లాలకు వెళ్తే ఒక్క రోజుకి రూ.1,500 నుంచి 2 వేలు తీసుకుంటున్నారు. సమయం, సందర్భాన్ని బట్టి ఈ టెంపరరీ డ్రైవర్లకు డిమాండ్ పెరుగుతుంది. 
సిటీలో డ్రైవర్లకు డిమాండ్

ఇక పర్మనెంట్ డ్యూటీ చేసేందుకు డ్రైవర్లు ఆసక్తి చూపడం లేదు. నెలకు రూ.15 నుంచి 20 వేలు ఇచ్చేందుకు ఓనర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ డ్రైవర్లు ముందుకు రావడం లేదని నగరవాసులు చెబుతున్నారు.ఓలా, ఊబర్ సంస్థలు రావడంతో చాలా మంది డ్రైవర్లు ఓనర్లుగా మారారు. కేవలం రూ.30వేలు పెట్టుబడితో వివిధ కార్ల సంస్థలతో నేరుగా ఓలా, ఊబర్స్ ఒప్పందాలు కుదుర్చుకొని డ్రైవర్లకు వాహనాలు ఇప్పించాయి. వాటి వ్యాపారంను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అతి తక్కువ డౌన్ పేమేంట్ ఉండటంతో ఎక్కువమంది డ్రైవర్లు వాహనాలు కొనుగోళ్లు చేశారు. ప్రతి నెలా మెయింటనెన్స్, ఫైనాన్స్, పెట్రోల్, ఇతర ఖర్చులు పోగ కనీసం రూ.30 వేల వరకు మిగులుతుండడంతో ఎక్కువ మంది క్యాబ్‌లను కొనుగోలు చేశారు. దీంతో సిటీలో డ్రైవర్ల కొరత ఏర్పడింది.

No comments:

Post a Comment