Breaking News

20/01/2020

డైనమిక్ సిటీగా హైద్రాబాద్

హైద్రాబాద్, జనవరి 20  (way2newstv.in)
అన్ని రంగాల్లో దూసుకుపోతూ దేశవ్యాప్తంగా ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సిగలో మరో కలికితురాయి చేరింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ రూపొందించిన ‘ 2020 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరాల జాబితా’లో భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో బెంగళూరు మహానగరం నిలవగా.. టాప్‌ 20 స్థానాల్లో ఏడు భారతీయ నగరాలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పేరొందిన జేఎల్‌ఎల్‌(జోన్స్‌ ల్యాంగ్‌ లాసలె) సంస్థ అధ్యయనం చేసింది.ఈ సంస్థ రూపొందించిన ‘సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌-2020’ని తెలంగాణ మంత్రి కేటీఆర్, జేఎల్‌ఎల్‌ సీఈవో రమేశ్‌ నాయర్‌, జీహెచ్‌ఎంసీ బొంతు రామ్మోహన్‌ తదితరులతో కలిసి శనివారం రాత్రి విడుదల చేశారు. 
డైనమిక్ సిటీగా హైద్రాబాద్

డైనమిక్‌ నగరాల సూచీలో ప్రపంచంలోని 130 నగరాలతో పోటీపడుతూ మూడేళ్లలో రెండుసార్లు హైదరాబాద్‌ అగ్ర స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ అసలు ఈ జాబితాలోనే లేదని, తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2015లో 20వస్థానం, 2016లో ఐదో స్థానం, 2017లో మూడో స్థానం, 2018లో మొదటి స్థానం, 2019లో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. 2020లో మరోసారి అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు.జేఎల్‌ఎల్‌ జాబితాలో భారత్‌ నుంచి ఏడు నగరాలు స్థానం సంపాదించాయి. హైదరాబాద్‌ (1), బెంగళూరు (2), చెన్నై(5), దిల్లీ(6), పుణె(12), కోల్‌కతా (16), ముంబయి (20) ఉన్నాయి. చైనా నుంచి షెన్‌జెన్‌(10), చోంగ్వింగ్‌(11), వుహాన్‌(13), హాంగ్‌ఝౌ(15), షాంఘై (17) ఐదు నగరాలు చేరాయి. సూచిక ప్రారంభించినప్పటి నుంచి తమ అధ్యయనంలో చైనా పనితీరు తగ్గుతోందని నివేదిక పేర్కొంది. అమెరికా నుంచి సిలికాన్‌వ్యాలీ (9), ఆస్టిన్‌ (19).. మధ్య ఆసియా నుంచి దుబాయి(14), రియాద్‌(18), ఆఫ్రికా నుంచి నైరోబీ(4) జాబితాలో నిలిచాయి.

No comments:

Post a Comment