Breaking News

03/01/2020

బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ లాంచర్లతో దాడి..

బాగ్దాద్, జనవరి 3, (way2newstv.in)
ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కొత్త ఏడాది రోజున ఇరాన్ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏకంగా రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. రాకెట్ దాడిలో ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.. కొద్ది గంటల తరువాత బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి తామే చేసినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా వైమానిక దళాలలకు చెందిన హెలికాప్లర్లే దాడి చేశాయని ఇరాక్ ఆరోపించింది.
బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ లాంచర్లతో దాడి..

ఇరాన్ అధ్యక్షుడు అయతోల్లా అలీ ఖమేనీ తర్వాత ఖాసీం సులేమాన్ అత్యంత శక్తివంతమైన నేత. ఇరాక్ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలు, దౌత్య సంబంధాలు, తదితర అంశాలలో ఈయనే కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ రాకెట్ దాడిలో ఇరాక్ పాపులర్ మొబిలైజేషన్ యూనిట్ డిప్యూటీ అధికారి, ఇరాన్ ఐబీ చీఫ్ సులేమాన్‌కు సన్నిహితుడైన ముహదీస్ అబు మహదీ అల్ ముహదస్ సైతం మృతిచెందినట్టు భావిస్తున్నారు.రెండు రోజుల కిందట ఇరాన్ మద్దతుదారులు ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వెంటనే అక్కడకు అదనపు బలగాల్ని పంపారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాక్- అమెరికా మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేసుకుంటున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన చర్యల వెనుక సులేమాన్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. బరాక్ ఒబామా హయాం నుంచి సులేమాన్‌ను అమెరికా టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతుదారులు దాడికి పాల్పడటంతో అమెరికా అహం దెబ్బతింది. దీంతో, హుటాహుటీన బలగాలను ఇరాక్ పంపింది. కువైట్‌లో 750 మందితో కూడిన వైమానిక దళాన్ని మోహరించింది. త్వరలో మరో 3,000 మందిని ఇరాక్‌కు తరలించనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

No comments:

Post a Comment