Breaking News

28/12/2019

పాఠశాలలో హరీష్ రావు తనిఖీ,

టీచర్లపై ఫైర్
మెదక్, డిసెంబర్ 28, (way2newstv.in)
పాఠశాల విద్యార్థుల ప్రతిభాపాటవాల పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని పరిశీలించారు. అదే విధంగా తరగతి గదిలోకి వెళ్లి అక్కడి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. 10వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు అడిగి.. వారి విజ్ఞానాన్ని పరీక్షించారు.అయితే మంత్రి హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు అక్కడి విద్యార్ధులు కనీసం సమాధానాలు కూడా చెప్పలేకపోవడం గమనార్హం. 
పాఠశాలలో హరీష్ రావు తనిఖీ,

మంత్రి తెలుగులో రాయమన్న పేర్లను కూడా విద్యార్థులు బోర్డుపై రాయలేకపోయారు. ఈ తీరుపై పాఠశాల ఉపాధ్యాయులను మంత్రి హరీష్‌ ప్రశ్నించారు. వారి బోధన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల చదువు ఇలా ఉంటే పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవుతారని మంత్రి హరీష్‌ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పదో తరగతికి వచ్చినా కనీసం పేర్లు రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం రాకపోతే ప్రపంచంతో ఎలా పోటీపడగలుగుతారని మండిపడ్డారు. అనంతరం మంత్రి హరీశ్ మధ్యాహ్న భోజనంపై ఆరాతీశారు

No comments:

Post a Comment