Breaking News

31/12/2019

సాంప్రదాయబద్దంగా కొయిల్ అల్వార్ తిరుమంజనం

తిరుమల డిసెంబర్ 31 (way2newstv.in)
తిరుమ‌ల‌లో కొయిల్ అల్వార్ తిరుమంజనాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించామన్నారు టిటిడి ఈ.ఓ అనిల్ కుమార్ సింఘాల్. జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం సందర్బంగా అంతకు ముందు వచ్చే మంగళవారం శ్రీ‌వారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు.  ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 
 సాంప్రదాయబద్దంగా  కొయిల్ అల్వార్ తిరుమంజనం

ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు,పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఇవ్వాళ  అష్టదళ పాదపద్మారాధన, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం సేవల‌ను టిటిడి రద్దు చేసినట్లు చెప్పారు టిటిడి ఈఓ.  వైకుంఠ ఏకాదశికి సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసామని అన్నారు ఈ.ఓ.

No comments:

Post a Comment