Breaking News

21/11/2019

శ్రీ శైలం డ్యామ్ కు ప్రమాదం ఉందా...

కర్నూలు, నవంబర్ 21 (way2newstv.in)
తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా.. మరమ్మత్తులు చేయపోతే భారీ నష్టం తప్పదా.. అవునంటున్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్. గంగాజల్ సాక్షరతయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన.. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందని.. మరమ్మతు చేయకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.పగుళ్లు వచ్చి డ్యామ్ ప్రమాదంలో ఉందని రాజేంద్ర సింగ్ హెచ్చరిస్తున్నారు. తీవ్ర హైడ్రోలిక్‌ ఒత్తిడి వల్ల నీటి వేగం అధికంగా ఉంటుందని.. దీంతో డ్యామ్ కోతకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. 
శ్రీ శైలం డ్యామ్ కు ప్రమాదం ఉందా...

పగుళ్లతో వాటర్ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని.. డ్యామ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదంగా మారిందని తెలిపారు. శ్రీశైలం ఆనకట్ట తెగితే సగం ఏపీకి నష్టమని.. నాగార్జున డ్యామ్ కొట్టుకుపోతుందంటున్నారు. సరైన వసతులు లేక డ్యామ్ దగ్గర పనిచేయడానికి ఇంజినీర్లు రావడం లేదని.. 600మంది పనిచేయాల్సిన చోట 100మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా డ్యామ్‌ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదని అభిప్రాయాన్ని రాజేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. డ్యామ్ సమీపంలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టును అంత పరిరక్షించుకోవచ్చని చెబుతున్నారు. డ్యామ్ రీహాబిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు-2 కింద నిధులు తీసుకోవచ్చని.. కేవలం రూ.60 కోట్లతో మరమ్మతులు పూర్తవుతాయంటున్నారు

No comments:

Post a Comment