Breaking News

22/11/2019

కొనసాగనున్న ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్ నవంబర్ 22, (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మళ్లీ సమ్మె దిశగా పయనిస్తోంది. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్లో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించారు.  ప్రభుత్వం సానుకూలంగా స్పందిచకపోవడంతో.. జేఏసీ నేతలు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామంటున్నారు. కార్మికులు ఎవరూ విధుల్లో చేరలేదని.. అసత్య ప్రచారాలు వద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. రేపు సేవ్ ఆర్టీసీ పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 
కొనసాగనున్న ఆర్టీసీ సమ్మె

జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె యధాతథంగా కొనసాగుతోందన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ విషయంలో ఇంకా వేచి చూస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. శనివారం ప్రతి డిపో ముందు ర్యాలీ చేపడతామన్నారు. సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేస్తామన్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఆర్టీసీ కార్మికుల కష్టాలు తెలియజేస్తామన్నారుకోర్టు ఇచ్చిన తీర్పును  గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు విధుల్లో చేరినట్టు వస్తున్న వార్తలను అయన కొట్టివేసారు. ఆ వార్తలన్నీ అసత్యాలని అన్నారు.  కార్మికులెవరూ విధుల్లో చేరలేదని చెప్పారు. కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. మరోసారి సమావేశం అవుతామని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment