Breaking News

04/11/2019

బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

న్యూ ఢిల్లీ  నవంబర్ 04  (way2newstv.in)
టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా   ఓ వెలుగు వెలిగిన మోత్కుపల్లి నరసింహులు నేడు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. మోత్కుపల్లికి కండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అంతకుముందు మోత్కుపల్లి అమిత్షాను కలిశారు. కాగా.. ఏపీలో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో  చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. 
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అసంతృప్తి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ సందర్భంలోనే మోత్కుపల్లిని బీజేపీలో చేర్చుకునేందు బీజేపీ వేసిన స్కెచ్ ఫలించింది. దీంతో మోత్కుపల్లి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఓ వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే బీజేపీ ఆయన ను తమ వైపు తిప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్  తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మోత్కుపల్లి చేరిక ఎలాంటి లాభం తెస్తుందో చూడాలి.

No comments:

Post a Comment