Breaking News

04/10/2019

అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్

న్యూఢిల్లీ, అక్టోబరు 4(way2newstv.in):
నీళ్లు, నిధుల అంశాలే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు కేసీఆర్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ భేటీ అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. దావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్

రెండు జీవనదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఏపీల్లోని బీడుభూములన్నింటికీ సాగునీరు అందించే అవకాశం ఉన్నందున.. అతి కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని పలుమార్లు కోరినప్పటికీ ఇవ్వలేదు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉండటంతో ఈ రెండింటిలో ఒకదానికి జాతీ య హోదా ఇవ్వాలని కోరనున్నారు.రాష్ట్రంలో హైవేల విస్తరణపై కూడా చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్‌రోడ్‌పై ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాతే.. కేంద్రం ఘర్‌ఘర్ జల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పథకానికి మిషన్ భగీరథను అనుసంధానంచేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ప్రధానితో చర్చించారు.

No comments:

Post a Comment