కడప అక్టోబర్ 4 (way2newstv.in)
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో కడప-బెంగళూరు ప్రధాన రహరాదిపై ఓ కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
లారీ-కారు ఢీ…నలుగురు మృతి
వెంటనే అతన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగంతో లారీని ఢీకొట్టడంతో మృతదేహాలు కూడా నుజ్జనుజ్జయిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినఅక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులను కడప వాసులుగా పోలీసులుగుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
No comments:
Post a Comment