నాగర్ కర్నూలు అక్టోబరు 4, (way2newstv.in)
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటి పరిధిలోని మల్లంకుంట బఫర్ జోన్ లో నిర్మించిన ఆక్రమ నిర్మాణాలను మున్సిపాలిటి ఆధికారులు జేసిబిలతో కూల్చివేశారు. గతంలో ఈప్రాంతంలో ఆక్రమ నిర్మాణాలను చేపట్టారని వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించని అధికారులు అచ్చంపేట
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో హై కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమ భవనాల నిర్మాణాలను స్ధానిక పోలీసుల సహకారంతో కూల్చివేసారు. .వీటితో పాటు మున్సిపాలిటి పరిధిలోని చాలాప్రాంతాల్లో ఇలాంటి ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయని వాటిని సైతం తోలగించాలని అచ్చంపేట పట్టణ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..
No comments:
Post a Comment