Breaking News

04/09/2019

ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులు

కొనియాడిన గవర్నర్ బిస్వ భూషన్ హరిచందన్
అమరావతి సెప్టెంబర్ 4 (way2newstv.in)
ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యనీయ బిస్వ భూషన్ హరిచందన్ కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు. భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేసుకున్నారు.
ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులు

డాక్టర్ రాధాకృష్ణన్ ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయిడు,  పండితుడు, తత్వవేత్త, రచయిత, రాజకీయ నాయకునిగా సేవలు అందించారని, తన జీవితాంతం ఉన్నత నైతిక విలువలకు నిలబడ్డారని ప్రస్తుతించారు. అదే మార్గంలో ఉపాధ్యాయ సమాజం పయనించాలని అకాంక్షించారు. ఉపాధ్యాయిలు  దేశ నిర్మాణంలో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారని,  వారి సహకారం లేకుండా ఏ సమాజమూ ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని గౌరవ గవర్నర్ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం నేపధ్యంలో రాజ్భవన్ నుండి ఈ మేరకు సందేశం వెలువడింది. 

No comments:

Post a Comment