Breaking News

04/09/2019

ఘనంగా గణనాథుల నిమజ్జనం

బేతంచెర్ల సెప్టెంబర్ 04 (way2newstv.in)
మండలంలో రెండవ తేదీ వినాయక చవితి సందర్భంగా వివిధ గ్రామాలలో కొలువైన గణనాథుల నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది మండలంలోని సిమెంట్ నగర్ ఆర్ఎస్ రంగాపురం మర్రికుంట గ్రామాలతోపాటు వివిధ గ్రామాలలో  దాదాపు 77 గణనాథుల విగ్రహాలను ఆయా కమిటీలు రెండవ తేదీ ప్రతిష్టించడం జరిగింది
ఘనంగా గణనాథుల నిమజ్జనం

2 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మూడవ రోజు అయిన బుధవారం ఉదయాన్నే పూజలు నిర్వహించి  ప్రత్యేక వాహనాలలో సంస్కృతి కార్యక్రమాల మధ్య ఉత్సాహంగా ఊరేగింపు కార్యక్రమం కొనసాగించారు అనంతరం ఆయా గ్రామాల పరిధిలోని నీటి నిల్వ లో గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా  సీఐ కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్ నాగేశ్ లు సిబ్బంది బందోబస్తు  నిర్వహిస్తూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు

No comments:

Post a Comment