Breaking News

09/09/2019

ఐదేళ్లలో సంపద రెట్టింపు

హైద్రాబాద్, సెప్టెంబర్ 9 (way2newstv.in)
తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందన్నారు సీఎం కేసీఆర్ గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు... యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీఎస్‌డీపీ.. 2018-19లో జీఎస్‌డీపీ 10.5శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మూలధన వ్యయంలో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదన్నారు.
ఐదేళ్లలో సంపద రెట్టింపు

16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని కేసీఆర్ స్పష్టం చేశారు. మూలధనం వ్యవయంలో కేంద్రానిది కేవలం 12.8 శాతం అని.. గత ఐదేళ్లలో మూలధనం కింద రూ.1,65, 167 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో సగటు ఆదాయ వృద్ధి రేటు 21.49 శాతం అని.. సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణతో అద్భుతాలు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 24 గంటల పాటు ఇవ్వడంతో... పారిశ్రామిక, వ్యవసాయరంగం పునరుత్తేజం సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి తోడ్పాటునందించిందని కేసీఆర్ పేర్కొన్నారు.తెలంగాణలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించామన్నారు. వ్యవసాయరంగంలో 8.1శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 1.8 శాతం నుంచి 6.3శాతం వృద్ధి సాధించామని కేసీఆర్ స్పష్టం చేశారు. పారిశ్రామికరంగంలో 5.8 శాతం వృద్ధి రేటు.. సేవలరంగంలో 11.8శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు అని.. 2018-19 నాటికి రూ.లక్షా 10 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో కనీవినీ ఎరుగుని రీతిలో విద్యుత్‌ ఉత్పాదన జరిగిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు

No comments:

Post a Comment