Breaking News

17/09/2019

మీడియా అధినేతతో ప్రహ్లాద్ జోషి భేటీ

హైద్రాబాద్, సెప్టెంబర్ 17 (way2newstv.in)
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మంగళవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్ అధినేతను కలిశారు. ఎన్టీవీ బాస్ నరేంద్ర చౌదరి నివాసానికి వెళ్లి కలిసొచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర చౌదరి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మీడియా సంస్థ అధినేతను కేంద్ర మంత్రి కలవడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలుస్తోంది. 
మీడియా అధినేతతో ప్రహ్లాద్ జోషి భేటీ

బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రులు మహాసంపర్క్‌ పేరిట వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తోన్న సంగతి తెలిసిందే.ప్రహ్లాద్ జోషి కూడా ‘మహాసంపర్క్’లో భాగంగానే నరేంద్ర చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు, తర్వాతి పర్యావసనాలను కేంద్ర మంత్రి నరేంద్ర చౌదరికి వివరించారు. ఈ సందర్భంగా.. కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికిన ఎన్టీవీ బాస్.. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.ప్రహ్లాద్ జోషితోపాటు బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు, సత్యకుమార్, సంతోష్ తదితరులు కూడా నరేంద్ర చౌదరిని కలిశారు. మహాసంపర్క్ సంగతి పక్కనబెడితే... ఏపీ, తెలంగాణల్లో బీజేపీ చేయబోయే పోరాటాలకు, కమలనాథుల గళం వినిపించడానికి మీడియా అండగా నిలవడం కోసం ఈ తరహా భేటీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

No comments:

Post a Comment