Breaking News

24/08/2019

జైట్లీ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

హైదరాబాద్, ఆగస్టు 24, (way2newstv.com)
కేంద్ర మాజీ మంత్రి ఆరుణ్ జైట్లీ మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేసారు. తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
జైట్లీ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

జైట్లీ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్ లో సంతాపం వ్యక్తం చేసారు. ‘అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment