Breaking News

12/08/2019

వైసీపీ నేతల అక్రమాలను అడ్డుకోండి : కన్నా లేఖ

విజయవాడ, ఆగస్టు 12 (way2newstv.in):
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి హోదాలో స్పందించి చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గ్రామస్థు నుంచి రూ.25లక్షలు వసూలు చేశారు. ఆ డబ్బుతో గ్రామంలోనే 24ఎకరాలు కొనుగోలు చేసి వాటర్ ట్యాంక్ నిర్మించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేశారు. 
వైసీపీ నేతల అక్రమాలను అడ్డుకోండి :  కన్నా లేఖ

అయితే ఆ స్థలంలో కొంత భాగాన్ని వైసీపీ నేతలు సిరివరపు విజయభాస్కర్‌రెడ్డి, సూరం రమణ కబ్జా చేసి ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. మూడు వారాల క్రితం నిర్మాణ పనులు చేపడుతూ గ్రామస్థులను బెదిరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి అయిన మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లేఖతో పాటు అక్రమ నిర్మాణాల ఫోటోలను కూడా జతపరుస్తున్నాం. అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకుని కారుమంచి గ్రామస్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై ఇటీవల బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు రాజన్న పేదోళ్ల ఆకలి నింపితే.. జగనన్న వారి కడుపులు కొడుతున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment